టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం.. ఏమైందంటే?

-

గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2021లో మంగళగిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించిన విచారణ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసును మంగళగిరి పోలీస్‌స్టేషన్ లిమిట్స్ నుంచి.. సీఐడీకి బదలాయించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్‌,లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఐడీకి బదలాయించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.కాగా, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version