నేటి మ్యాచ్ లో చావో రేవో తేలిపోతుంది..!

-

ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే నేడు కింగ్స్ లెవెన్ పంజాబ్.. ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిని సంతరించుకుంది. ఎందుకంటే వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు జట్టు ఈసారి కూడా విజయం సాధించి తమ సత్తా చాటాలని చూస్తుంటే మరో వైపు పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి తమకు ప్లే ఆఫ్ కు అవకాశాలను సజీవంగా చేసుకోవాలని ప్రయత్నిస్తోంది..

ముఖ్యంగా పంజాబ్ జట్టు కు నేడు జరగబోయే మ్యాచ్ చావో రేవో తేల్చుకునే మ్యాచ్ అని చెప్పాలి. ఇప్పటికీ ఐపీఎల్లో 7 మ్యాచ్ లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ఈ మ్యాచ్ విజయం సాధిస్తే తప్ప పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉండవు. అందుకే ఈ రోజు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news