ఈరోజు సాయంత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం

-

నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ చాలా ఉత్కంఠ బరితంగా సాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు రెండు రౌండ్లు కలిపి ఒక లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి అవుతుంది.

Thinmar Mallanna’s majority in the second round

మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44 వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయిన తరువాత రెండో ప్రాధాన్యత కోసం 52 మంది అభ్యర్థులలో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news