ఇవాళ యథావిధిగా రెండో టీ20 : శ్రీలంక బోర్డు ప్రకటన

-

ఇవాళ శ్రీలంక మరియు టీం ఇండియా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌ పై శ్రీలంక బోర్డు కీలక ప్రకటన చేసింది. నిన్న రద్దు అయిన రెండో టీ20 మ్యాచ్‌ ను తిరిగి యథావిధిగా ఇవాళ నిర్వహిస్తామని శ్రీలంక బోర్డు ప్రకటించేసింది. శ్రీలంక బోర్డు తాజాగా ప్రకటన తో ఇవాళ భారత్‌ మరియు శ్రీలంక జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది.

ఇక ఈ మ్యాచ్‌ కొలంబో వేదికగా జరుగనుండగా.. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా… కృనాల్‌ పాండ్యాకు కరోనా మహమ్మారి పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో… నిన్న జరుగాల్సిన రెండో టీ 20 మ్యాచ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇక అటు ఈ టీ-20 సిరిస్‌ లో 1-0 తేడాతో టీం ఇండియా ముందుంది.ఇక అటు కృనాల్‌ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న రాహుల్‌ చాహల్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, మనీష్ పాండే, కృష్ణప్ప గౌతమ్, హర్ధిక్‌ మరియు ఇషాన్ కిషన్ ఇవాళ్టి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news