ఆరు నెలల్లో బీజేపీలో టీడీపీ విలీనం : కొడాలి నాని సంచలనం

-

ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు.

నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని…మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని మండిపడ్డారు. దాడి చేయడమే కాకుండా దళితులను దుర్భాషలాడారని… పోలీసులను కూడా బెదిరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని నిప్పులు చెరిగారు. అక్కడ జరిగే మైనింగ్ క్వారీలు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయని.. అత్యంత ఎక్కువ మైనింగ్ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. అక్కడి కాంట్రాక్టర్లను ఉమ డబ్బులకోసం బెదిరించాడని… ఆ తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అని బెదిరించి అనుమతులు రద్దు చేయించాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఖర్జూర నాయుడు రాజ్యాంగం నడిచిందా..? మా ఎమ్మెల్యే కేపీకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. అవినీతి చక్రవర్తి ఈ రాష్ట్రంలో ఒక్క చంద్రబాబేనని పేర్కొన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news