ఉప్మా మీద పడిందని తోటి విద్యార్థి గొంతు కోసిన మరో విద్యార్థి!

-

గచ్చిబౌలి పరిధిలోని గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. చిన్న వివాదం కారణంగా.. ఓ విద్యార్థి గొంతు కోసాడు మరో విద్యార్థి. ఆ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… గచ్చిబౌలి పరిధిలోని గురుకుల పాఠశాలలో గొంతు కోశాడు తోటి విద్యార్ది.

దీంతో తీవ్ర రక్త స్రావం అయిన ఆ బాధిత విద్యార్థిని గచ్చిబౌలి హాస్పిటల్ కు తరలించారు అధికారులు. అయితే.. బాధిత విద్యార్థికి చికిత్స అందించిన వైద్యులు… ప్రాణా పాయం లేదని తేల్చి చెప్పారు.

రాత్రిపూట అల్పాహారం తింటుం డగా ఉప్మా చేయి మీద పడిందని ఆ ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం చెలరేగినట్లు సమాచారం అందుతోంది. అయితే… టీచర్ జ్యోక్యంతో అప్పటికి సద్దుమణిగింది వివాదం. కానీ… అర్ధరాత్రి సమయంలో కత్తి తో దాడి చేశాడు తోటి విద్యార్ది. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news