దాడులపై సిట్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

-

తిరుపతి, అనంతపురం,తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో జరిగిన దాడులపై సిట్ ఉన్నత అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.దాడులకు సంబంధించి వివరాలను సాక్షాధారాలతో సీట్ అధికారులకు అందజేసినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య వెల్లడించారు.

మొత్తం 30 ఘటనలకు సంబంధించిన వివరాలు తమ రిప్రజెంటేషన్‌లో పొందుపరిచామని, తప్పు చేసిన వారు ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని సిట్ అధికారి వినీత్ బిజ్రల్ చెప్పారని ఆయన అన్నారు.చాలాకాలం తర్వాత స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చామని , ఇప్పటివరకు డీజీపీ కార్యాలయం వైసీపీ కార్యాలయం అనే భావన ఉండేదని వర్ల రామయ్య అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని వైసీపీ నాయకులు పేరు మోసిన దొంగల ముఠా అని విమర్శించారు. వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకాలు చేశారో వారు రాష్ట్రం దాటి పారిపోయారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version