ఏడవ తరగతి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్

-

కాకినాడ జిల్లా జీ మేడపాడులో ఏడో తరగతి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కీచక టీచర్. జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఏడో తరగతి విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు సోషల్ టీచర్ రమణ. మమ్మల్ని తాకకూడని ప్రాంతంలో ముట్టుకునే వాడిని చెబుతున్నారు విద్యార్థినులు. నడుము పట్టుకుని దగ్గరికి లాగే వాడని చెబుతూ ఆవేదనకు గురయ్యారు విద్యార్థినులు.

 

బూతులు మాట్లాడుతూ తిట్టేవాడని.. హెడ్ మాస్టర్ కి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు విద్యార్థినులు. దీంతో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు కీ పిర్యాదు చేశారు విద్యార్థినుల తల్లిదండ్రులు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు దొరబాబు. దీంతో ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు డీఈవో. అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news