మందు బాబులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

-

తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు… ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు అంటూ తెలంగాణ ఆబ్కారి శాఖ తెలిపింది. ఈ మేరకు ఆబ్కారి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే లాక్ డౌన్ నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో మే 6 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం షాపులకు అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత ఈ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆ నిబంధనను ఎత్తివేస్తూ.. ఇంతకుముందు కొనసాగిన విధంగానే రాత్రి 10 గంటల వరకు కొనసాగిందుకు అనుమతి ఇచ్చింది ప్రస్తుతం తెలంగాణ ఆబ్కారి శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news