కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి చేసిన దుండగులు

-

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని అత్తికుల్లాపూర్ గ్రామ స‌మీపంలో కేంద్ర స‌హాయ మంత్రి స‌త్య‌పాల్ బ‌ఘేల్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగింది. ముఖ్యంగా దండ‌గులు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. క‌ర్హ‌ల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అత్తికుల్లాపూర్ గ్రామం స‌మీపంలో కేంద్ర మంత్రి ఎస్పీ బ‌ఘెల్ కాన్వాయ్‌పై రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేసారు.

మంత్రి క్షేమంగా ఉన్నార‌ని మెయిన్‌పురి పోలీసులు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లుతున్న స‌మ‌యంలో ఈదాడి జరిగింది. బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. స‌మాజ్ వాదీ పార్టీ నాయ‌కులే ఈ దాడి చేసార‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అత్తికుల్లాపూర్ నుంచి క‌ర్హాల్ వెళ్లుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కొంత‌మంది అఖిలేష్ భ‌య్యా జిందాబాద్ అని నినాదాలు చేశారు. కాన్వాయ్ నుంచి సెక్యూరిటీ దిగిన వెంట‌నే దుండ‌గులు ప‌రార‌య్యారు.

Read more RELATED
Recommended to you

Latest news