తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించే యోచనలో టీటీడీ పాలకమండలి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలిపిరి మెట్ల మార్గం అలాగే క్యూ లైన్ లలో రద్దీ తదితర కారణాలతో ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం చెల్లించే విధంగా టీటీడీ పాలక మండలి… భారీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే రోజు తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న సంగతి తెలిసిందే. అంతస్థాయిలో భక్తులు వస్తున్న నేపథ్యంలో భీమా సాధ్యసాధ్యలపై… టీటీడీ పాలక మండలి ఆలోచన కూడా చేస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాగా ఇటీవల తిరుమల శ్రీవారి టికెట్ల కోసం క్యూ లైన్ కట్టిన తరుణంలో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో భక్తులు మరణించారు. అటు అలిపిరి మార్గంలో ఓ చిన్నారి… పులి దాడిలో మరణించిన సంగతి తెలిసిందే.