కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి: ఈడీ

-

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వార ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కోర్టు ముందు హాజరుపరిచారు. సీఎం కేజ్రీవాల్‌ రూ.100 కోట్లు డిమాండ్‌ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడి కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా తెలిపింది.

కేజ్రీవాల్‌ పీఎంఎల్‌ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఆయన పేరు లేదని, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదించారు. కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news