దేశంలో ఇంతకంటే పెద్ద స్కామ్ లేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

మేడిగడ్డ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.స్వతంత్ర భారత దేశంలో ఇంతపెద్ద స్కామ్ ఎక్కడా జరుగలేదని ఆరోపించారు .మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టుకు అసలు పునాదే బలంగా లేదని….మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మరో 40 వేల కోట్లు కావాలని అన్నారు. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి రూ.వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని ఉత్తమ్ అన్నారు.

రాష్ట్ర పన్నుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి మరో 30 వేల కోట్లు ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన పనులు చూసి పిచ్చి తుగ్లక్ కూడా సిగ్గుపడుతారని ఎద్దేవా చేశారు. 14 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news