కెసిఆర్ కంటే గొప్ప నాయకులు ఎవరూ లేరు – రేగా కాంతారావు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల కోట్ల నిధులతో జిల్లా అభివృద్ధి 70 ఏళ్లలో సాధించలేని పనులు కేసీఆర్ కే సాధ్యమైందని అన్నారు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. కెసిఆర్ కంటే గొప్ప నాయకులు ఎవరూ లేరని కార్యకర్తలు తొందరపడవద్దని రేగా కాంతారావు సోషల్ మీడియా వేదిక గా తెలిపారు.

నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అశ్వరావుపేట లో ఆత్మీయ సమ్మేళనం నేపద్యంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ ఈ చేశారు . మంచిగా ఉన్న అశ్వరావుపేటను బదనామ్ చేయడానికి వస్తున్నారని, అసరా పేట నియోజకవర్గంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని, పార్టీపై గౌరవం ఉన్నవారు పార్టీ వ్యతిరేకల సమావేశాలకు వెళ్లవద్దని సోషల్ మీడియా వేదిక హెచ్చరించారు. మళ్ళీ మూడోవ సారి మన ప్రభుత్వమే వస్తుందని రేగా కాంతరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news