కాంగ్రెస్ లో గొడవలు చూసి సిగ్గుపడుతున్నా – రేణుక చౌదరి

-

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిబిఐ విచారణ మంచిదేనని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ లో గొడవలు చూసి సిగ్గు పడుతున్నానని వ్యాఖ్యానించారు. ఇంచార్జి వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో సిగ్గు పడుతున్నానని అన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.

మిగిలిన నాయకులు పాదయాత్ర ఎప్పుడు చేస్తారా? అని చూస్తున్నానని అన్నారు. తను కూడా వెళ్లి వారి పాదయాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఖమ్మం కి రేవంత్ ని ఆహ్వానిస్తామని.. పెద్ద సభ పెడతామని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించడానికి ఎవరికి బాధ్యత అప్పచెప్పలేదన్నారు. ఆ విషయాన్ని థాక్రే చూసుకుంటారని అన్నారు. ఎక్కడా దిక్కులేని వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని.. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news