కిమ్ చేతిపై ఏ మచ్చా లేదు… అతను క్షేమం…!

-

ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్న ఆరోగ్యం పై గత పది రోజులుగా ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఆయన మరణించాడు అని బాగానే ఉన్నాడు అని ఆపరేషన్ జరిగింది అని అసలు బ్రతికే అవకాశం లేదని ఆరోగ్యం విషమం గా ఉందని కథనాలు వచ్చాయి. రెండు దేశాలు అయితే అతను మరణించాడు అని కూడా చెప్పారు. కాని అది నిజం కాదని నేను బాగానే ఉన్నా అని మీడియా ముందుకు వచ్చాడు.

ఒక ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి గానూ బాబు హాజరు అయ్యాడు. దీనితో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఇక అతను హాజరైన సమయంలో అతని చేతి మీద ఏదో మచ్చ ఉందనే ప్రచారం జరిగింది. అతనికి ఆపరేషన్ చేసారు అని అందుకే ఆ మచ్చ వేసారని అన్నారు. కాని అది నిజం కాదని స్పష్టం చేసింది దక్షిణ కొరియా మీడియా. అతని చేతి మీద ఏ మచ్చా లేదని చెప్పింది.

అతని చేతి మీద ఉన్న మచ్చ చిన్నప్పటిదే గాని కొత్తగా ఏమీ లేదని అనవసర ప్రచారాలు చేసి అనవసరంగా కంగారు పడవద్దు అని మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలని, అతని ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అతను పూర్తి క్షేమంగా ఉన్నాడు అని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. అనవసరంగా ప్రచారం చేస్తే అతని ఆగ్రహానికి గురవ్వాలి అని హెచ్చరికలు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news