హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. ఇవాళ ఉ.5:30 గంటలకు బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. అయితే దీనిపై చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చారట.
దింతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం నెలకొనడం తో 4 గంటలుగా ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.