బాలయ్యతో ఈసారి సందడి చేయనున్న మరో ముగ్గురు గెస్ట్లు వీళ్లే..!!

-

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో రెండవ సీజన్ చాలా సందడిగా సాగుతోంది. స్టార్ సెలబ్రిటీ లతో బాలకృష్ణ చేస్తున్న సందడి అంతా కాదు. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలతో కూడా బాలయ్య బాబు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు ఇప్పటికే ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు మరో ముగ్గురు గెస్ట్ లు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ – గోపీచంద్ లు ప్రత్యేకంగా గెస్ట్లుగా రావడం హైలెట్గా నిలిచింది .

అయితే కొత్త ఏడాది సందర్భంగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నామని డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఆహా స్థాయి పెరిగే విధంగా ఎపిసోడ్స్ రాబోతున్నట్లుగా కూడా అర్థమవుతుంది. అందుకే అందరి ఫోకస్ ప్రస్తుతం ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ పైనే ఉండడం గమనార్హం . అయితే ఇప్పుడు అంతకంటే ముందు మరికొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.ఏకంగా మరో ముగ్గురు స్టార్లు షోలోకి రాబోతున్నారు. అందులో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ ఉండగా .. ఒకరు లేటెస్ట్ గ్లామరస్ హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే జయప్రద, జయసుధ ఈ షో కి వస్తున్నారంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీంతో వీరితోపాటు మరొక యంగ్ హీరోయిన్ ఎవరైనా ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆహా ఒక ట్వీట్ షేర్ చేసింది. ఒక ఫోటోలో నట సింహతో సహజ నటి అని తెలియజేయగా.. మరొక ఫోటోలో అన్ స్టాపబుల్ లో సాగర సంగమం అని వివరణ ఇచ్చారు. మూడవ ఫోటోలో ఏం సందేహం లేదు ఈమె మీ ఊహలతో గుసగుసలాడుతుందని మరొక హింట్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరో కనిపెట్టాలి అని ఆహా సోషల్ మీడియాలో కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది ఇక ఫ్యాన్స్ కూడా వారి స్టైల్ లో వివరణ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సహజ నటి జయసుధ.. సాగర సంగమం లో నటించిన జయప్రద.. ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించిన రాశిఖన్నా స్టేజ్ పైకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news