మహాశివరాత్రి రోజు పూజా సమయంలో పాటించవలసిన నియమాలు ఇవే..!

-

అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. భోళాశంకరుడు శివయ్య అనుగ్రహం పొందడానికి చేసే పండుగల్లో అతిముఖ్యమైంది శివరాత్రి. ఈ పర్వదినం రోజున శైవభక్తులు శివుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తుంటారు. అయితే శివరాత్రి రోజున తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలని కలుగజేస్తాయి. ఇక మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికి తెలిసిన విషయాలే. అయితే పూజా చేసే సమయంలో ఏఏ నియమాలను పాటించాలి. పరమేశ్వరునికి పూజా ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.

maha-shivaratri
maha-shivaratri

ఈ పర్వదినం రోజున ముఖ్యంగా శివుడిని పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి. ఈ అభిషేకాలు చేస్తున్నంత సేపు ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ముందుగా ఈ అభిషేకాలు చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారలాతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పుర్ణాహుతి నిర్వహించాలి. శివకథలు వింటూ జాగరణ చేయాలి.

అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారి శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే. కృష్ణపక్ష చతుర్ధశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ బహుళ చతుర్ధశినే మహాశివరాత్రిగా జరపుకుంటాం. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.

ఇక మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఉపవాస, జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news