సారంగదారియా పాట వివాదంపై క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల

-

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న తెలుగు పాట ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చే పేరు, సారంగ దరియా. లవ్ స్టోరీ చిత్రం కోసం తెలంగాణ జానపదాన్ని తీసుకుని మంచి సాహిత్యాన్ని జతకూర్చి ప్రేక్షకులకి అందించారు. ఈ పాట వచ్చీ రావడంతోనే పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వివాదమూ అయ్యింది. అవును, పాట హక్కుల గురించి రోజూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో దర్శకులు శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

తన మొదటి సినిమాలో లక్కీ అల అనే పాటని వాడుకున్నానని, అలా వాడుకున్నందుకు ఆ పాట యజమానులకి డబ్బులు చెల్లించానని, తన ప్రతీ సినిమాలో ఏదో ఒక పాట వాడుకుంటాననీ, వాటన్నింటికీ డబ్బులు చెల్లించామని, ప్రస్తుతం సారంగ దరియా పాటని కోమలి గారితోనే పాడించాలనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, కాకపోతే ఆడియో ఫంక్షన్లో ఆమె చేతే పాడిస్తామని, పాట సేకరించినందుకు డబ్బులు కూడా చెల్లిస్తామని తెలిపారు. ఈ దెబ్బతో పాట మీద నడిచిన వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news