పృధ్వీ కాస్త ఓవర్ చేస్తున్నట్టు అనిపించడం లేదా ??

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి పేరు సంపాదించాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. ఇదే సమయంలో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉంటూ జగన్ తో కలిసి రాజకీయ అడుగులు కూడా వేయడం జరిగింది. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో మరియు అదే విధంగా ఎన్నికల ప్రచారంలో కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పార్టీ తరఫున బాగా కష్ట పడ్డారు. ఇదే సమయంలో జగన్ అధికారంలోకి రావడంతో పార్టీకి అండగా తనకి తోడుగా పని చేసిన పృథ్వి కష్టాన్ని గుర్తించి పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ పదవిని ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. svbc ex chairman prudhvi raj very emotional and crying in encounter with murali krishna showఎస్.వి.బి.సి చైర్మన్ పదవి దక్కించుకున్న పృథ్వి అతితక్కువ కాలంలోనే అదే సంస్థలో పని చేస్తున్న ఓ మహిళతో రాసలీలలు స్టార్ట్ చేస్తూ మాట్లాడిన ఓ ఆడియో లీక్ కలిగిన కాల్ బయటకు రావడంతో పదవి నుండి పృధ్విని వైసీపీ హైకమాండ్ తప్పించింది. దీంతో ప్రస్తుతం సినిమారంగంలో బిజీ అయిన పృథ్వి…ఇటీవల పలు చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయంగా తనను దెబ్బకొట్టాలని అనేక ఆరోపణలు చేశారు. అంతేకాకుండా లీకైన ఆ ఆడియో టేప్ అంతా ఫేక్ అని కావాలనే తనను ఇరికించారని చెప్పారు.

 

ఆ ఘటన ని తలచుకొని సదరు ఛానల్ స్టూడియోలోనే  అన్యాయం జరిగిందంటూ ఏడ్చేశారు. తానెప్పుడూ ఇలాంటి టీవీ కార్యక్రమాల్లో కన్నీళ్లు పెట్టుకోలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తన జాతకం ప్రకారం తనను ఇబ్బంది పెట్టినవాళ్లు ఎవరూ బతికిలేరని.. వెంకటేశ్వర స్వామి సాక్షిగా.. కుటుంబ సభ్యుల సాక్షిగా ఒట్టేసి చెబుతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆపు నీ ఓవరాక్షన్..అసలు ముందు ఆ ఆడియో టేప్ గురించి నిరూపించుకునే అప్పుడు స్టూడియో లోకి వచ్చి మాట్లాడు అంటూ ఎటకారం చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news