THIRUMALA: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి.

-

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టిటిడి.మే 1వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మెట్టుమార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.గత ఏడాది నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది.భక్తులు కొండపైకి ఎక్కలేనంతగా దెబ్బతింది.ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని మూసివేసిన టీటీడీ…మరమ్మతులు చేపట్టింది.ఈ క్రమంలో ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్ళీ తెరుచుకోనుంది.ఈ సందర్భంగా టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది.వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది.దీంతో ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది.శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకోనుండడమ్ పై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.కంపార్ట్మెంట్లలో భక్తులను నుంచి, సర్వ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news