Breaking : తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఓఎస్టీ డాల‌ర్ శేషాద్రి మృతి

-

తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వారి ఓఎస్టీ డాల‌ర్ శేషాద్రి ఆక‌స్మికం గా మృతి చెందాడు. గుండె పోటు తో ఈ రోజు తెల్ల‌వారు జామున డాల‌ర్ శేషాద్రి క‌న్నుమూశారు. విశాఖ పట్నం లో కార్తీక దీపోత్స‌వ కర్య‌క్ర‌మం కోసం వెళ్లిన డాల‌ర్ శేషాద్రి కి ఈ రోజు తెల్ల‌వారు జామున గుండె పోటు వ‌చ్చింది. దీంతో డాల‌ర్ శేషాద్రి ని ఆస్ప‌త్రి కి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు.

అయితే డాల‌ర్ శేషాద్రి 1978 నుంచి తిరుమల తిరుప‌తి శ్రీ‌వారి సేవ లో కొన‌సాగారు. అయితే 2007 లో డాల‌ర్ శేషాద్రి రిటైర్ అయ్యారు. కానీ డాల‌ర్ శేషాద్రి సేవ‌ల ను ఉప‌యోగించు కోవాల‌ని తిరుమ‌ల శ్రీ‌వారి ఓఎస్డీ గా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ వారి ఓఎస్డీ గా నే కొన‌సాగుతున్నారు. అయితే డాల‌ర్ శేషాద్రి మ‌ర‌ణం టీటీడీ కి తీర‌ని న‌ష్ట మ‌ని టీటీడీ అద‌న‌పు ఈ వో ధ‌ర్మారెడ్డి అన్నారు. ఆయ‌న మృతికి సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news