చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు – మంత్రి జయరాం

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఎన్టీఆర్ ఏం చేశాడో చెబుతాడు కానీ.. ఆయన ఏం చేశాడు చెప్పలేడని సెటైర్లు వేశారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడని ప్రశ్నించారు మంత్రి జయరాం. ఇక ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు “మా నమ్మకం సీఎం జగనే” పేరుతో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news