వారెవ్వా.. ఇంట‌ర్నెట్ లేకుంటే ఏమి ? ఇలా కూడా పాఠాలు చెప్ప‌వ‌చ్చు..!

-

కరోనా వల్ల విద్యార్థులకు పాఠశాలలు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తున్నాయి. బాగానే ఉంది. కానీ ఇంటి వద్ద అసలు ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి ? మన దేశంలో చాలా మంది నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వారి ఇండ్లలో కాదు కదా.. వారి గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయమే ఉండదు. అలాంటప్పుడు వారు ఆన్‌లైన్‌లో పాఠాలను ఎలా వింటారు ? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏది ? అంటే.. ఆ గ్రామ ఉపాధ్యాయులు ఇందుకు చక్కని ఉపాయం కనిపెట్టారు.

this teachers in jharkhand village taking classes in loud speakers

జార్ఖండ్‌లోని బంకతి అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 246 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారిలో కేవలం 42 మంది విద్యార్థులకు మాత్రమే ఇంటి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ గ్రామంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగ్గా లేదు. దీంతో విద్యార్థులు ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరు కావడం కష్టంగా మారింది. అయితే ఇందుకు అక్కడి ఉపాధ్యాయులు పరిష్కారం కనుగొన్నారు. ఆ గ్రామంలో అనేక చోట్ల లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేయించారు. ఈ క్రమంలో ఆ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులు 5 మంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విడతల వారీగా క్లాసులు తీసుకుంటున్నారు. స్కూల్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఫోన్‌లో వారు పాఠాలను చెబుతుంటే గ్రామంలో ఆయా చోట్ల ఏర్పాటు చేసిన లౌడ్‌ స్పీకర్లలో వారి పాఠాలు వినిపిస్తాయి. ఆ స్పీకర్ల వద్ద విద్యార్థులు కూర్చుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటారు. నోట్స్‌ రాసుకుంటారు. ఇలా ఆ ఉపాధ్యాయులు అక్కడి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

కాగా ఈ విషయంపై అక్కడి ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అనుసరిస్తున్న పద్ధతిని వారు మెచ్చుకున్నారు. విద్యార్థులకు ఎలాగైనా సరే విద్యనందించాలని వారు చేసిన ప్రయత్నాన్ని ఆ గ్రామస్థులు కూడా అభినందిస్తున్నారు. అవును మరి.. ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నామంటూ రూ.వేలు, లక్షల్లో ఫీజులు దండుకునే స్కూళ్ల కన్నా.. ఇలాంటి స్కూళ్లు ఎంతో బెటర్‌ కదా.

Read more RELATED
Recommended to you

Latest news