ఈసారి ఐపీఎల్ లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్

-

వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌పై ఇండియన్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ధ్రువ్ జురెల్ చెలరేగుతాడని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.బ్యాటింగ్ ఆర్డర్‌లో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుందని చెప్పారు.ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో ధ్రువ్ జురెల్ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇండియా విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 90, 39 రన్స్ తో రాణించాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ ఆడుతున్నాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతను కొన్ని మ్యాచ్ల లో మాత్రమే ఆడి ఇంపాక్ట్ ప్లేయర్‌గా 172.73 స్ట్రైక్‌రేట్‌తో 152 పరుగులు చేశాడు.ఈసారి ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news