ప్రముఖ పుణ్యక్షేత్రంలో ‘పుష్ప-2’ షూటింగ్…చూసేందుకు తరలివచ్చిన ఫ్యాన్స్ !

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇక ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం శరవేగంగా షూటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో సినిమాలోని కీలక సన్నివేశాలను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని యాగంటి పుణ్య క్షేత్రంలో తీశారు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక దీనిలో పాల్గొన్నారు. దీంతో అభిమాన నటీనటులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్న హాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news