టాస్ గెలిచిన వారే ఓడిపోతున్నారా..?

-

ఐపీఎల్ 2020 సీజన్ ఎంతో హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా భారత్లో జరిగే ఐపీఎల్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది జట్ల కెప్టెన్లు అక్కడి పరిస్థితులను ఇంకా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన సమయంలో ఫీల్డింగ్ ఎంచుకోవాలా బ్యాటింగ్ ఎంచుకోవాలా అనే దానిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు జట్టు కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలు కూడా జుట్టుకు సరైన ఫలితాలను ఇవ్వలేకపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఆసక్తికర టాక్ కూడా వినిపిస్తుంది ఐపీఎల్ 2020 టోర్నీలో టాస్ గెలిచిన జట్లు ఎక్కువగా ఓటమి చవి చూస్తున్నారన్నది ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో టాస్ గెలిచిన జట్టు ఎక్కువగా ఓటమి పాలు అయ్యాయని అటు ప్రేక్షకులు కూడా చర్చించుకుంటున్నారు. అయితే యూఏఈ లో ఉన్న వాతావరణ పరిస్థితులను సరైన రీతిలో అంచనా వేయకపోవడం తోనే టాస్ గెలిచిన అనంతరం తీసుకున్న నిర్ణయాలు సరిగా ప్రభావం చూపలేక పోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news