ధోనీసేన కి మరో భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..?

-

ఏడాది ఐపీఎల్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తూ ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న విషయం తెలిసిందే. వరుస ఓటమిని చవి చూస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే చెన్నై జట్టుకు మొదటి నుంచి భారీ షాకులు తగులుతున్నాయి. చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు అయినా సురేష్ రైనా హర్భజన్ సింగ్ లు జట్టుకు దూరమవడం ఆ తర్వాత క్రమంలోనే చెన్నై జట్టు లో కరోనా వైరస్ వెలుగులోకి రావడం..

ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు వరుస షాకులు తగులుతునే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి భారీ భారీ షాక్ తగిలింది చెన్నై జట్టుకు . ఇటీవలే గాయం నుంచి కోలుకున్న బ్రావో చెన్నై జట్టు లో చేరడంతో జట్టు కాస్త బలంగా మారింది. కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో గాయం బారినపడిన బ్రావో పూర్తిగా ఐపీఎల్ టోర్నీ కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న బ్రావో జట్టుకు దూరం అవడంతో ధోనీసేనకు భారీ షాక్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news