చిరంజీవి, బాలయ్య బాబు థియేటర్స్ కోసం యుద్దం చేయాల్సిందే.!

-

సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య 107 మధ్య వుందని అంటుంటే ఇప్పుడు మరో యంగ్ హీరో అఖిల్ కూడా  సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటున్నాడట.

ఇందులో ముందే ఆది పురుష్ తో కర్చీఫ్ వేసిన ప్రభాస్, అలాగే బడా నిర్మాత దిల్ రాజు విజయ్ సినిమా వారసుడు తో పోటీ లో వున్నారు.ఇప్పుడు సినిమాల మధ్య మరింత పోటీ ఎక్కువగా వుండే అవకాశం ఉందని అంటున్నారు. ఇన్ని సినిమాలు ఒకే సారి వచ్చి థియేటర్స్ పై దాడి చేస్తే ఏ సినిమా చూడాలో కూడా ప్రేక్షకులకు అర్ధం కాదు. అలాంటి పరిస్థితే ఈ సారి దీపావళి కి ఎదురు అయ్యింది.

ఇప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ చేద్దామని చూస్తున్న వాటికి థియేటర్స్ పంచే సరికి తల ప్రాణం తోకకు వస్తుంది. కాక పోతే ఇందులో దిల్ రాజు మాత్రం ఏ మాత్రం టెన్షన్ లేకుండా వున్నాడట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు దిల్ రాజు  చేతిలో వున్నాయి.అందుకే దిల్ రాజు ఎవరు ఎంత గోల పెట్టినా సంక్రాంతిని వదిలి పెట్టడు. దీనికి ఇంకో రీజన్ ఏమిటంటే ఇది తమిళంలో కూడా అదే సమయంలో రిలీజ్ అవుతోంది. కాబట్టి ఇక మిగిలిన వారు థియేటర్స్ కోసం యుద్దం చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news