ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 కొత్త ఎయిర్‌పోర్టులు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పతింది. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన చేయడం జరిగింది. త్వరలోనే నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తిలలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

అక్టోబర్ 26న విజయవాడ – పూణే, అక్టోబర్ 27న విశాఖ – ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇక త్వరలోనే దుబాయ్, సింగపూర్ కి సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం షార్జాకి సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు రామ్మోహన్ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news