హైదరాబాద్ లో విషాదం.. కరెంట్‌ షాక్‌ తో ముగ్గురు యువకులు మృతి

-

హైదరాబాద్ లోని షేక్ పేట్ విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌ తో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. షేక్ పేట్ పారామౌంట్ కాలనీ లో విద్యుత్ గాతం తో ముగ్గురు యువకుల మృతి చెందారు. నీటి సంప్ వద్ద మోటర్ ఆఫ్ చేయడానికి వెళ్లిన యువకుడు… ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్ గాతం వచ్చింది.

ఇక అతని రక్షించడానికి వెళ్లిన ఇద్దరు యువకులకు కూడా షాక్‌ కొట్టింది. దీంతో అక్కడే కుప్పకూలి పోయారు ఆ ముగ్గురు యువకులు. స్పాట్ డెడ్ అయినట్లు సమాచారం. దీంతో విషాదం లో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. రంజాన్ మాసంలో తమ కుమారులు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆనస్, రిజ్వాన్, రజాక్ లు మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version