షాకింగ్: భర్తను కట్టేసి భర్త కళ్ళ ముందే భార్యను రేప్…!

-

ఎన్ని చట్టాలు చేసినా సరే, ఎన్ని శిక్షలు అమలు చేసినా సరే రేప్ ఘటనలు మాత్రం అసలు ఆగడం లేదు. ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా సరే మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెలుగోడు జమ్మి నగర్ తండాలో దారుణ రేప్ ఘటన జరిగింది. భర్త బంధించి భార్యను లాక్కెళ్ళి అత్యాచారం చేసారు నలుగురు వ్యక్తులు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో సంచలనం అయింది.

అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీనితో వెలుగోడు పోలీస్ స్టేషన్ ను ముట్టడి౦చి… గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై హోం మంత్రి సమాధానం చెప్పాలి అంటూ వారు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version