రుతుక్రమ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే..!

-

మహిళలు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. ముఖ్యంగా రుతుక్రమ సమయంలో ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది. కనుక జీవనశైలిని మార్చుకొని మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. పైగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి మార్పులు ఎంతో అవసరం. ఎప్పుడైతే రోజువారి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారో, రుతుక్రమం క్రమబద్ధంగా సరిగా ఉంటుంది మరియు పీఎంఎస్‌కు సంబంధించిన లక్షణాలు తక్కువగా ఉంటాయి. దీంతో రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి మరియు రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చు. కనుక ఇటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా మీ డైట్‌లో భాగంగా తీసుకోండి.

ఎప్పుడైతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారో, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. పైగా రుతుక్రమం సక్రమంగా వస్తుంది. కనుక ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బి6, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా, రుతుక్రమం వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్, ఉబ్బరం వంటి లక్షణాలు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చిలకడదుంప, గోధుమలు, తృణధాన్యాలు, ఓట్స్ వంటి ఆహారాన్ని తీసుకోవడం వలన రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి.

ఈ విధంగా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అదేవిధంగా ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నప్పుడు ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా కెఫైన్ అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. వీటితో పాటు రుతుక్రమంలో వచ్చే వాపు, నొప్పి వంటి లక్షణాలు తగ్గాలంటే బెర్రీలు, అల్లం, చేపలు, పసుపు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు కడుపు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. కనుక ఈ ఆహారపు అలవాట్లను చేసుకుని, రుతుక్రమ సమయంలో ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news