వీడి కిక్కు తగిలెయ్యా చావు ఎలా ఉంటుందో చూడాలనుకుని టిక్‌టాక్ చేసి చివరికి.. ?

-

లోకంలో చావడం అనేది కామన్‌గా ఎలా మారిందో, టిక్‌టాక్ అనేది ఫ్యాషన్‌గా మారింది.. ఇక చస్తూ టిక్‌టాక్ చేయడమంటే అదొక పిచ్చి అని అనుకోవాలో మతిలేని పని అనుకోవాలో తెలియని స్దితిలో యువత బ్రతుకుతున్నారు.. ఈ మధ్య కాలంలో చావడానికి ముందుగా టిక్‌టాక్ చేసి మరీ చస్తున్నారు.. ఇలాంటి కేసు ఒకటి తగిలింది.. ఒక 24 ఏళ్ల కుర్రాడు తల్లి తిట్టిందని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడట.. ఇక్కడే ఇతను ఒక ట్విస్ట్ ఇచ్చాడు..అదేమంటే చనిపోయే ముందు తన ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నానని చెబుతూ, ఆత్మహత్య చేసుకునే సమయంలో వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. వీడి కిక్కు తగిలెయ్యా చనిపోయే ముందు ఫీలింగ్ తెలుసుకున్నాడు గానీ చచ్చాక కుక్కకంటే హీనంగా పారేస్తారని మాత్రం తెలుసుకోలేక పోయాడు..

 

ఐనా చచ్చే వాడి ముఖంలో ఏ ఫీలింగ్ ఉంటే ఏంది.. పోయాక ఆ ఫిలింగ్స్ పట్టుకుని సాధించేది ఏముంది అని అంటున్నారు నెటిజన్స్.. ఇక ఇతను అంతగా ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణం ఏం లేదని పనిపాట లేక జులాయిగా తిరుగుతుంటే తల్లి మందలించిందనే సాకుతో తనకు పాడే కట్టుకున్నాడు.. ఇక ఈ ఘటన జరిగింది బెంగళూరులోని తుమ్మకూరు జిల్లాలోని కోరతాగెరే తాలూకాలో గౌరంగనహళ్లి ప్రాంతంలో..

 

ఇంతటి ఘనకార్యం చేసిన మృతుని పేరు ధనుంజయ్.. ‘నేను చావు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను’ అని ఆ వీడియోలో పేర్కొన్న ఇతను చావును చూశాడు కానీ ఎలా ఉందో తెలుసుకుని ఎవరికి చెప్పకుండానే పోయాడు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వారు లోకంలో చాల మందే ఉన్నారు.. ఇలాంటి వెధవ పనులు చేసే ముందు మీ తల్లిదండ్రుల కోసం ఒక్క సారి ఆలోచించండి అంటున్నారు కొందరు..

Read more RELATED
Recommended to you

Latest news