నేడు మాజీ సీఎం రోశయ్య అంత్య క్రియలు..పాల్గొనున్న ప్రముఖులు

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య.. నిన్న అనారోగ్య సమస్యల కారణంగా… మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ ప్రముఖులు అందరూ… రోశయ్యకు తెలిపారు. కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

రోశయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుండి 11 గంటలకు గాంధీభవన్ కు తరలించనున్నారు.. గాంధీభవన్ లో అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు.. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. అక్కడి నుంచి కొంపల్లి లోని ఫామ్ హౌస్ కు అంతిమ యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ అంత్యక్రియల్లో కార్యక్రమాల్లో.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా రోశయ్య మృతి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news