IPL 2021 : నేడు ముంబై, కోల్ కత్తా మధ్య మ్యాచ్.. రోహిత్ శర్మ రీ ఎంట్రీ !

-

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దుబాయ్ లో ప్రారంభమైన ఈ రెండవ సీజన్ ఐపీఎల్ లో… నాలుగు మ్యాచ్ లు పూర్తి కాగా… ఇవాళ ఐదో మ్యాచ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ జట్ల మధ్య జరిగే ఐదో మ్యాచ్ అబుదాబీ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక ఈ జట్ల బలాబలాల విషయానికి వస్తే… కోల్ కత్తా నైట్రైడర్స్ జట్టు కంటే ముంబై జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు హార్దిక్ పాండ్యా… ఈ మ్యాచ్ కు కూడా దూరం కానున్నాడు. ఇది ఇలా ఉండగా… బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై భారీ విజయాన్ని సాధించిన కోల్ కత్తా నైట్ రైడర్స్… ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించాలనే కసితో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news