ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటు తో దర్శకుడు మృతి…!

-

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుసగా మరణాలు ని చూస్తున్నాం. ప్రముఖ జర్నలిస్ట్, దర్శకుడు కే జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ప్రముఖ జర్నలిస్ట్ దర్శకుడు అయిన కేఎన్టి శాస్త్రి చిన్న కొడుకు జయ దేవ్. ఇప్పటివరకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో ‘కోరంగి నుంచి’ అనే సినిమా వచ్చింది. మంచి పేరు కూడా ఆయనకి కోరంగి నుంచి తో వచ్చింది. ఈ సినిమాని నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది.

మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఎన్ ఎఫ్ డి సి ప్రతి ఏటా కొని మూవీస్ కి ఫండింగ్ ఇస్తుంది. కోరంగి నుంచి సినిమాకి ఏకంగా కోటి రూపాయలని ఫండింగ్ గా ఇచ్చారు ఈ సినిమాలో 25 ఏళ్ల తర్వాత నటి అర్చన నటించారు. ఈ సినిమా జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శన అంతమైంది.

Read more RELATED
Recommended to you

Latest news