సీఈసీ బృందాన్ని కలిసిన వైసీపీ కీలక నేతలు

-

సీఈసీ బృందాన్ని కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా మాట్లాడుతూ.. సీఈసీకి మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించాం. జనసేనకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని అడిగాం. పొత్తులో భాగంగా టీడీపీ అడిగిందని చెప్పారు. గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు.. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు.

కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈఓకి కంప్లైంట్ ఇచ్చారు.. ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నాడు కర్నూల్ జిల్లాలో 67370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ అక్కడ వెరిఫికేషన్ చేసాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారు. తప్పు దోవ పట్టించిన కోనేరు సురేష్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news