బ్రేకింగ్ : ఈడీ విచారణకు హజరైన హీరో తరుణ్

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కాసేపటి క్రితమే హీరో తరుణ్ ఈడీ విచారణకు హజరయ్యారు. బంజారాహిల్స్ లోని తన ఇంటి నుండి బయల్దేరిన తరుణ్… నేరుగా ఈడీ ఆఫీస్‌ కు చేరుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు తో విచారణ కు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన ఈడీ… ఈ నేపథ్యం లోనే హీరో తరుణ్‌ హజరయ్యారు. గతంలో డ్రగ్స్ వ్యవహారం లో ఎక్స్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను ఎదుర్కొన్న తరుణ్.. కొద్దీ రోజులు క్రితమే డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ వేసింది ఎక్సైజ్ శాఖ.

విచారణ లో భాగంగా తరుణ్ నుండి నమూనాలను సేకరించి FSL కి పంపారు అధికారులు. తరుణ్ నుండి సేకరించిన నమునాల్లో డ్రగ్స్ఆనవాళ్లు లేవని FSL రిపోర్ట్ లో తేలింది. దీంతో హీరో తరుణ్, డైరెక్టర్ పూరీ కి క్లిన్ చిట్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. ఇక ఈడీ విచారణకు హజరైన తరుణ్‌ ను 2017 ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారించనున్నారు. ఎఫ్ లాంజ్ పబ్ వ్యవహారాలు.. నవదీప్ పార్టీలపై తరుణ్ ని ఆరా తీయనుంది ఈడీ. కెల్విన్ తో ఉన్న సంబంధాలు, ఆర్ధిక లావాదేవీల వ్యవహారంలో ప్రశ్నించనుంది ఈడీ.

Read more RELATED
Recommended to you

Latest news