నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం…? దిగ్బ్రాంతిలో టాలీవుడ్…!

-

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో సీనియర్ నటులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. ఇన్నాళ్ళు ప్రేక్షకులను అలరించిన వారు ఇప్పుడు అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. యాంకర్ సుమా ఆడపడుచు శ్రీలక్ష్మి మరణ వార్త జీర్ణించుకోక ముందే మరో సంఘటన జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రేక్షకులను తన విలనిజం తో అలరిస్తున్న నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం.

గురువారం సాయంత్ర౦ ఆయన తన ఇంట్లో పడిపోయారని వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు యశోదా ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందుతుందని ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు కూడా ఏమీ చెప్పడం లేదు. కమెడియన్‌గా, విలన్‌గా ఆయన పలు సినిమాల్లో అభిమానులను అలరించారు, వర్మ సినిమాల్లో ఎక్కువగా కనపడతారు.

ఈ ఘటనపై ఆయన భార్య స్పందించారు. తన భర్త సాయంత్రం 4 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని… దీంతో మేము సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించామని ఆమె వివరించారు. ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించామని చెప్పారు. అనుకోకుండా కోమాలోకి వెళ్లిపోయాడని… 48 గంటల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉంచారని వివరించారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుందని అన్నారు. ఇంట్లో కింద పడిపోయాడని… తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news