శిల్పా చౌదరి చేతిలో దారుణంగా మోసపోయిన టాలీవుడ్ యంగ్ హీరో

-

కిట్టి పార్టీల పేరుతో.. విఐపిల నుంచి భారీగా డబ్బులు రాబట్టింది శిల్ప చౌదరి. అయితే ఈ శిల్ప చౌదరి… చేతిలో సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు కూడా దారుణంగా మోసపోయారు. శిల్ప చౌదరి అరెస్టు కావడంతో.. ఆమె చేతిలో మోసపోయిన ఒక సెలబ్రిటీ బయట పడుతున్నారు. ఇప్పటికే కే.జీ రా సుదీర్ బాబు భార్య ప్రియదర్శిని చౌదరిపై ఫిర్యాదు చేసింది.

అక్షరాల రెండు కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకొని… తనకు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది ప్రియదర్శిని. అయితే తాజాగా సెహరి సినిమా హీరో హర్షు కన్నుమెళ్ళ కూడా శిల్పా చౌదరి చేతిలో మోసపోయాడు. 3 కోట్ల రూపాయలు తీసుకొని తనను మోసం చేసిందని తాజాగా శిల్ప చౌదరిపై హీరో హర్ష్ ఫిర్యాదు చేశాడు. శిల్ప చౌదరి నిర్వహించే పార్టీలకు హాజరై ఈ టాలీవుడ్ హీరో అడ్డంగా బుక్కయ్యాడు. ఇక హీరో హర్షు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సెహరి అనే సినిమాలో… హర్ష్ కనుమల్లి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news