టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి

-

టాలీవుడ్‌ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. 2020 నుంచి చిత్ర పరిశ్రమను ఇలా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అయితే.. తాజాగా పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మృతి చెందారు.

కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ గచ్చిబౌలి లోని ఏఐజీ ఆస్పత్రి లో ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మరణించినట్లు సమాచారం అందుతోంది. ఆర్‌ ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై వెంకట్‌ పలు సినిమా లను నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రా వాలా, ఢమరుకం, కిక్‌, ఆటోనగర్‌ సూర్య, మిరపకాయ్‌, బిజినెస్‌ మ్యాన్‌, పైసా లాంటి సినిమా లను ఆర్‌. ఆర్‌. వెంకట్‌ నిర్మించారు. ఇక ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మరణ వార్త వినగానే…ఆయన కుటుంబం తో పాటు.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లో తీవ్ర విషాదం లోకి వెళ్లింది. ఆర్‌. ఆర్‌. వెంకట్‌ మరణం పట్ల పలుగురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news