TPCC : తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలి.. తీర్మానం ప్రతిపాదించిన రేవంత్‌ రెడ్డి

-

ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ తొలిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిపింది .పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 3 తీర్మానాలు తీసుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీకి అభినందనలు తెలుపుతూ రేవంత్‌ రెడ్డి తొలి తీర్మానం తీసుకోగ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్‌రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ మూడో తీర్మానం చేశారు.

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వము అమలు చేసి తీరుతుందని ఆయన హామీ ఇచ్చారు. 17 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమావేశం జరుపుదామన్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్‌ఛార్జిలతో సన్నాహక సమావేశం లు జరిపి, 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news