సొంత భూమిని 165 మంది పేదలకు పంచిన టీడీపీ ఎమ్మెల్యే…..

-

టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ 6.65 ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచి మంచి మనసు చాటుకున్నారు.ఉరవకొండ మండలం మైలారంపల్లిలో ఉన్న భూమిని 165 మంది పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఒక్కొక్కరికి పంపిణీ చేశారు. దీని విలువ దాదాపు రూ.1.33 కోట్లు ఉంటుంది.అతనే వారిపై రిజిస్ట్రేషన్ చేయించి ఆ పత్రాలను పేదలకు ఇచ్చారు. దీంతో పేదలకు అండగా నిలబడిన ఏకైక నాయకుడు పయ్యావుల కేశవ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తుంది.

కాగా పీఏబీఆర్ జలాశయానికి సమీపంలో ఉన్న మైలారంపల్లి గ్రామం గత సంవత్సరం జలాశయం ముంపునకు గురైంది. ఈ విషయాన్ని గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే మైలారంపల్లి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తట్టుకోలేకపోయారు. భవిష్యత్తులో మైలారంపల్లి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి తన భూమిని సాయం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news