వాహన దారులకు షాక్…10 చలాన్లు దాటితే స్టేషన్ కే..!

-

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు.

Traffic Challan
Traffic Challan

ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అని పోలీసులు వాహన దారులకు వివరిస్తారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఒకసారి చలాన్ కట్టినా మళ్లీ పది సార్లు అలాంటి తప్పులే చేస్తున్నారనే నేపథ్యం లో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news