టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య

-

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఇండస్ట్రీలో ఎవ్వరో ఒకరూ మరణిస్తుూనే ఉంటున్నారు. ఇటీవలే నిర్మాత, ఈనాడు అధినేత, రామోజీరావు మరణించిన విషయం తెలిసిందే.   తాజాగా  టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని  కావూరి హిల్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, రెండు రోజుల క్రితమే తన ఫ్లాట్ డోర్ లాక్ చేసుకుని ఆమె ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు ఫ్లాట్ల వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతర ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ను అన్లాక్ చేసి చూడగా స్పప్న వర్మ ఉరేసుకుని కనిపించింది. కాగా, గత ఆరు నెలల నుంచి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. స్వప్నవర్మ స్వస్థలం రాజమండ్రి కాగా, మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news