మునుగోడు ఉపఎన్నిక పోలింగ్.. ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి నారాయణపురం పరిధి లింగవారిగూడెం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మునుగోడు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూసుకుంట్ల సూచించారు.

298 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. నియోజకవర్గవ్యాప్తంగా 2 లక్షల 41 వేల 855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. గతంలో గెలుపొంది 2018లో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోమారు తెరాస తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల పోరులో నిలిచారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా శంకరాచారి, 10 మంది ఇతర పార్టీల అభ్యర్థులు, 33 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news