తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..ఉచితంగా వైద్య పరీక్షలు

-

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు నేటి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. రోజుకు కనీసం 1,800 మందికి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య డేటాను రూపొందిస్తామని పేర్కొన్నారు.

వైద్య పరీక్షల నిర్వహణ కోసం 58 కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పర్యవేక్షణకు హైదరాబాదులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి కార్మికులు, ఉద్యోగులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Latest news