మొద‌టి స్థానంలో టీఆర్ఎస్, రెండో స్థానంలో టీడీపీ

-

దేశ వ్యాప్తంగా అత్యధిక విరాళాలు సేక‌రించిన ప్రాంతీయ పార్టీలలో మొద‌టి స్థానంలో తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ కు విరాళాల‌లో రూపంలో రూ. 89 కోట్లు వచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల‌లో టీఆర్ ఎస్ కే అత్య‌ధికం. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌తి ప‌క్ష పార్టీ అయిన టీడీపీ రెండో స్థానంలో ఉంది. టీడీపీ కి విరాళాల రూపంలో రూ. 81 కోట్లు వ‌చ్చాయి. అలాగే మూడో స్థానం లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఉంది.

వైసీపీ కి విరాళాల రూపం లో రూ. 74 కోట్లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఏడీఆర్ అనే సంస్థ విడుద‌ల చేసింది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల కు గుర్తు తెలియని వ్య‌క్తుల నుంచి వ‌చ్చిన మొత్తం విరాళాల విలువ రూ. 445.77 కోట్లు ఉంటాయ‌ని ఏడీఆర్ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీక‌లు గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి వ‌చ్చిన విరాళాల‌లో దాదాపు 95 శాతం ఎల‌క్ట్రోర‌ల్ బాండ్ల రూపం లో నే వ‌చ్చాయ‌ని ఏడీఆర్ తెలిపింది. కాగ ప్రాంతీయ పార్టీ ల‌లో ఎక్కువ విరాళాలు సేక‌రించిన మొద‌టి మూడు స్థానాల‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న ప్రాంతీయ పార్టీ లే ఉండ‌టం గ‌మ‌నార్షం.

Read more RELATED
Recommended to you

Latest news